ఉదయ్ శంకర్, జెన్నీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’. శ్రీరామ్ ఆర్ట్స్ పతాకంపై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. గురు పవన్ దర్శకుడు. ఈ నెల 11న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు గురు పవన్ మాట్లాడుతూ…‘విశాఖ నేపథ్యంగా సాగే థ్రిల్లింగ్ లవ్ స్టోరి ఇది. ఇష్టపడిన అమ్మాయిని ఎలాగైనా తన ప్రేమకు ఒప్పించుకోవాలని హీరో ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రేమ కథకు అంతర్లీనంగా థ్రిల్లర్ అంశాలుంటాయి. ఇన్వెస్ట్మెంట్ యాప్ వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు ఒక ఇబ్బందిలో పడితే కథానాయకుడు ఎలా ఆ సమస్యను పరిష్కరించాడు అనేది ఇందులో చూపిస్తున్నాం. ఈ పాయింట్తో ఇప్పటిదాకా సినిమా రాలేదు’ అన్నారు.