నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం టక్ జగదీష్. సమ్మర్లో విడుదల కావలసిన ఈ చిత్రం కరోనా వలన వాయిదా పడింది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత సినిమా థియేటర్లో విడుదల అవుతుందని అందరు భావించారు.కాని ఈ సినిమాకి ఓటీటీ నుండి భారీ ఆఫర్ రావడంతో నిర్మాతలు అమెజాన్ ప్రైమ్లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.
టక్ జగదీష్ ఓటీటీలో విడుదల కానుంది అనే సరికి ఎగ్జిబిటర్స్ పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే నిర్మాతలు తమ పరిస్థితిని అర్ధం చేసుకోవాలని,తమకు అండగా ఉండాలని ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో టక్ జగదీష్ ఓటీటీలో రావడం పక్కా అని అనుకున్నారు. ఈ క్రమంలో నాని గురువారం రోజు రేపు అని ఒక కామెంట్ పెట్టాడు. దీంతో టక్ జగదీష్ స్ట్రీమింగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాడని అందరు భావిస్తున్నారు.
ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 10 అర్ధ రాత్రి 12 గంటలకి టక్ జగదీష్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా.. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్గా నటించారు.ఇక ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్ అదిరిపోయే ఆఫర్ను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓటీటీ విడుదల కోసం ఏకంగా రూ. 45 కోట్లను అమెజాన్ ప్రైమ్ చెల్లించినట్లు సమాచారం. సన్ షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తున్నారు.