పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలలో సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రానికి రీమేక్గా రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. మూవీకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. పేరుకు మాత్రం స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్న త్రివిక్రమ్ చిత్రానికి పూర్తి బాధ్యతలు తానే మోస్తున్నాడనే టాక్ బయట వినిపిస్తుంది.
అయితే త్రివిక్రమ్ రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. భీమ్లా నాయక్ నిర్మాతలు ఏకంగా రూ. 15 కోట్ల రూపాయలు త్రివిక్రమ్ కి రెమ్యునరేషన్గా ఇస్తున్నారట. దానితో పాటు లాభాలలో కొంత పర్సెంటేజ్ కూడా ఆయనకు ఉందట. ఓ పూర్తి స్థాయి చిత్రానికి దర్శకత్వం చేస్తే వచ్చే రెమ్యూనరేషన్ కంటే అధికంగా త్రివిక్రమ్ భీమ్లా నాయక్ చిత్రానికి తీసుకుంటున్నారట.ఈ విషయం ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
భీమ్లా నాయక్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేశాయి. సంగీత దర్శకుడు తమన్ ఎప్పటిలానే మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటికి సంబంధించిన పాత్రల ఫస్ట్ లుక్ టీజర్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా క్లిక్కయ్యాయి. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తో పాటు ట్రైలర్ కూడా విడుదల అయితే సినిమాపై పూర్తి స్థాయి క్లారిటీ వస్తుందని అంటున్నారు.