Trivikram Remunaration | మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్వకత్వంలో సినిమా వస్తుందంటే ఆ సినిమాలో కామెడీ, యాక్షన్, భావోధ్వేగాలు పుష్కలంగా ఉంటాయి. కుటుంబమంతా కలిసి చూసేలా ఈయన సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. ఈయన సినిమాల్లో ప్రతి క్యారెక్టర్కు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈయన కలం నుంచి వచ్చే ప్రతి పదం మనల్ని ఆలోచించేలా చేస్తుంది. ప్రస్తుతం ఈయన సూపర్స్టార్ మహేష్బాబుతో #SSMB28 చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఈయన రెమ్యురేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
త్రివిక్రమ్ ‘అలా వైకుంఠపురం’ సినిమాకు దాదాపు 25కోట్ల వరకు రెమ్యునరేషన్ను తీసుకున్నాడట. అయితే ఇప్పుడు మహేష్ బాబుతో తెరకెక్కబోయే సినిమాకు రెట్టింపుగా దాదాపు 50కోట్ల పారితోషకాన్ని తీసుకుంటున్నట్లు సమాచారం. ఈయనకున్న క్రేజ్తో నిర్మాతలు కూడా ఎంతైనా పారితోషకాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట. లేటెస్ట్గా ఈయన ‘భీమ్లానాయక్’ చిత్రానికి మాటలు స్క్రీన్ప్లే అందించాడు. దీనికి గాను దాదాపు 14కోట్ల వరకు పారితోషకం అందుకున్నాడట. అతడు,ఖలేజా వంటి క్లాసిక్ హిట్ల తర్వాత ఈ కాంబోలో సినిమా రావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది.