Trisha | త్రిష నాయికగా నటిస్తున్న కొత్త సినిమా ‘లియో’. విజయ్ హీరోగా నటిస్తున్నారు. 14 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ జంట తెరపై కనిపించబోతున్నారు. ఈ సినిమా పట్ల ఎక్కువ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నదీ తార. అందుకే ‘లియో’కు సంబంధించిన ప్రతి అప్డేట్ను నెటిజన్లతో పంచుకుంటున్నది. కశ్మీర్ షెడ్యూల్ ముగించుకుని తాజాగా చెన్నైలో ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఓ స్టూడియోలో వేసిన సెట్లో షూటింగ్ చేస్తున్నారు. ఈ సెట్లో అడుగుపెట్టిన త్రిష తన లుక్ రివీల్ అవకుండా ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
‘మళ్లీ వచ్చేశాను..’ అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ రాసింది. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో సంజయ్ దత్, నివీన్ పాలి, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి ప్రముఖ నటీనటులు భాగమవుతున్నారు. అక్టోబర్ 19న ఈ సినిమాను తెరపైకి తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నది.