OG Show Tragedy In Bhadrachalam | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ (They Call Him OG) సినిమా విడుదల సందర్భంగా భద్రాచలంలోని ఏషియన్ థియేటర్లో విషాదం చోటు చేసుకుంది. ఓజీ సినిమా చూసేందుకు వచ్చిన అభిమానుల కోలాహలం కారణంగా థియేటర్లోని భారీ సౌండ్ స్పీకర్లు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అభిమానులకు తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు.
ఓజీ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ ఆవరణలో అభిమానులు పెద్ద ఎత్తున కేకలు వేస్తూ, డ్యాన్సులు చేస్తూ హంగామా సృష్టించారు. అయితే ఈ క్రమంలోనే థియేటర్లోని గోడకు అమర్చిన భారీ సౌండ్ సిస్టమ్ స్పీకర్లు కిందపడినట్లు సమాచారం. ఇక స్పీకర్లు నేరుగా కింద ఉన్న ఇద్దరు అభిమానులపై పడటంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ప్రమాదానికి అసలు కారణం థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే అని అభిమానులు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. థియేటర్లో ఉన్న సామర్థ్యం కంటే దాదాపు 1200 మందికి పైగా ప్రేక్షకులను లోపలికి అనుమతించారని అభిమానులు మండిపడుతున్నారు. అభిమానుల ప్రాణాలతో చెలగాటం ఆడిన థియేటర్ యాజమాన్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు ప్రారంభించారు.
OG సినిమా షోలో విషాదం
స్పీకర్ మీద పడి ఇద్దరు అభిమానులకు తీవ్ర గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏషియన్ థియేటర్లో ఘటన
కెపాసిటీకి మించి 1200 మందిని థియేటర్లోకి అనుమతించడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యామని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అభిమానుల ఆగ్రహం pic.twitter.com/oDBxZDvMBJ
— Telugu Scribe (@TeluguScribe) September 25, 2025