Megastar Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి (Chiranjeevi)కి అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. 2024 పద్మపురస్కారాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారం (Padma Vibhushan) పద్మవిభూషణ్కు చిరంజీవిని ఎంపిక చేసింది. దీంతో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు చిరుకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక శుక్రవారం టాలీవుడ్ సినీ ప్రముఖులు అంతా మెగాస్టార్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా ప్రత్యేకంగా వెళ్లి చిరుని కలిశారు. అయితే చిరును కలిసిన అనంతరం దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారం (Padma Vibhushan) పద్మవిభూషణ్ చిరుకు రావడం పట్ల మెగాస్టార్ కోసం ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దిల్ రాజు ప్రకటించాడు. ఇక ఈ ఈవెంట్లో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా చిరంజీవిని ఘనంగా సన్మానం చేయనున్నట్లు సమాచారం.