టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ఎన్టీఆర్ (Jr NTR) హోస్ట్గా వ్యవహరిస్తున్న షో ఎవరు మీలో కోటీశ్వరులు (Evaru Meelo Koteeswarulu). ఈ షోలో ఇప్పటికే అతిథులుగా రాజమౌళి, కొరటాల శివ, సమంత సందడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ షోకు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఎవరు మీలో కోటీశ్వరులుకు సంబంధించిన అన్ని ఎపిసోడ్స్ ను పూర్తి చేశాడట ఎన్టీఆర్. మహేశ్బాబు, తమన్, దేవీ శ్రీ ప్రసాద్ ఎపిసోడ్లను కూడా వేగంగా పూర్తి చేసినట్టు సమాచారం.
ఈ నందమూరి హీరో తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న 30వ సినిమా కోసం మేకోవర్ చేసుకునే పనిలో కూడా పడిపోయినట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఎవరు మీలో కోటీశ్వరులు షోకు ఎన్టీఆర్ భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా చేస్తున్న షో చిత్రీకరణ మొత్తం పూర్తవగా..మరి రెండో సీజన్తో ప్రేక్షకులను పలుకరిస్తాడా..? లేదా అన్న దానిపై తారక్ స్పష్టత ఇవ్వలేదు.
తారక్ మళ్లీ చిన్ని తెరపై కనిపిస్తాడా..? లేదా అనేది చూడాలి మరి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తోన్న మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
ఇది కూడా చూడండి
Chiranjeevi | మోహన్బాబుకు చిరంజీవి పిలుపు
చాలా విషయాల్లో బైలాస్ మారుస్తాం: మంచు విష్ణు
Jacqueline Fernandez | నాలుగోసారీ ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన బాలీవుడ్ నటి