Tollywood Directors Day | తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన దర్శకులు టాలీవుడ్ స్టార్ హీరో నానిని కలిశారు. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. నాని31 గా వస్తున్న ఈ ప్రాజెక్ట్కు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తుండగా.. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్తో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే తాజాగా ఈ షూటింగ్ సెట్స్లో టాలీవుడ్ దర్శకులు సందడి చేశారు.
2024 మే 4న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా.. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ డే జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించి ఇప్పటికే అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. ఇదిలావుంటే తాజాగా నానికి టీఎఫ్డీఏ అసోసియేషన్ ప్రతినిధులు ఆహ్వానం అందించారు. వారి ఆహ్వానాన్ని స్వీకరించిన నాని తప్పకుండా ఈవెంట్కు హాజరవుతానని హామీనిచ్చారు. సాయి రాజేశ్, శైలెష్ కోలను, శివ నిర్వాణతో పాటు పలువురు దర్శకులు నానిని కలిసిన వారిలో ఉన్నారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Tollywood Directors Association, Members of #TFDA Met Our Very Own Natural Star @NameisNani and Invited him to the “Telugu Film Directors Day” Event on May 4th @ LB Stadium, #Nani also agreed to attend event. pic.twitter.com/Qp12VSLM4Y
— Vamsi Kaka (@vamsikaka) April 15, 2024