డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో లైగర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ మూవీ నిర్మాణంలో భాగస్వామిగా ఉండగా… పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి నిర్మిస్తున్నారు. కరోనా వలన ఈ చిత్ర షూటింగ్ నత్తనడకన సాగుతుంది.
కరోనా వలన ఆగిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవల గోవాలో తిరిగి ప్రారంభం అయింది. నెల రోజులు పైగా సాగే ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. హీరోహీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణం అంతా చిత్రీకరణలో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ నటి అనన్య పాండే కథానాయికగా నటించింది.
ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేకంగా తర్ఫీదు పొందారు. పాన్ ఇండియా చిత్రంగా పూరీ ఈ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, ఈ రోజు సాయంత్రం 4గం.లకు క్రేజీ అప్డేట్ ఇవ్వనున్నట్టు పూరీ కనెక్ట్స్ తెలియజేసింది. ఈ అప్డేట్తో రిలీజ్ డేట్పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.