న్యూఢిల్లీ, జూన్ 23 : పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు రెబల్స్గా మారి వేరే వర్గంగా ఏర్పడిన క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పదాధికారులు, జాతీయ కార్యవర్గ సభ్యుల జాబితాలను ఎన్నికల సంఘానికి పంపి, మమతా బెనర్జీయే తమ పార్టీ నేతగా కొనసాగుతారని స్పష్టం చేసింది.
తమ పార్టీ నిర్వాహక నిర్మాణం ఇది అని ఈసీకి తెలియజేసింది. ఈ జాబితా ప్రకారం పార్టీకి చైర్పర్సన్గా మమతా బెనర్జీ ఉన్నారు. సుబ్రతా బక్షి ఉపాధ్యక్షునిగా, అభిషేక్ బెనర్జీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.