Tillu Square | రెండేండ్ల కిందట వచ్చిన డీజే టిల్లు సినిమాతో టాలీవుడ్లో ఒక సెన్సేషన్ సృష్టించాడు టాలీవుడ్ యువ నటుడు సిద్ధూ జొన్నలగడ్డ. యుత్ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం జనాలకు విపరీతంగా నచ్చేసింది. ఇక తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. టిల్లు స్క్వేర్ (Tillu Square) అంటూ వస్తున్న ఈ సినిమాలో మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ కథనాయికగా నటిస్తుండగా.. మల్లిక్రామ్ (Mallik Ram) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్తో పాటు ట్రైలర్లు విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్తో యూట్యూబ్లో దూసుకుపోతున్నాయి. ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్రబృందం. ఈ నేపథ్యంలోనే సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమాకు యూ/ఏ (U/A)సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్రబృందం ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఇక రన్టైం విషయానికి వస్తే.. 121 నిమిషాలు ఉన్నట్లు సమాచారం. మాలిక్ రామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై చాలా అంచనాలే ఉన్నాయి. ఇక టిల్లు స్క్వైర్ నుంచి వచ్చిన టీజర్ ఈ సినిమాపై హైప్ పెంచేశాయి. మొదటి పార్ట్లో రాధికతో క్రైమ్ ఎపిసోడ్ మాదిరిగానే ఇందులోనూ మరో ఇంట్రెస్టింగ్ డ్రామా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. ఈ మూవీని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ తెరకెక్కిస్తున్నారు.
#TilluSquare is certified with 𝐔/𝐀
Worldwide grand release at theatres near you on MARCH 29th!
In Cinemas #TilluSquareOnMarch29th pic.twitter.com/dIFCuGqCiA
— Vamsi Kaka (@vamsikaka) March 22, 2024