Tiger Nageshwara Rao First Look Poster | మాస్ రాజ రవితేజ లైనప్లో అందరినీ ఎక్కువ ఎగ్జైట్మెంట్కు గురి చేస్తున్న ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. ఇండియన్ రాబిడ్ హుడ్గా పిలవబడే గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ అధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. 70,80 దశకాల్లో నాగేశ్వరరావు ఆంధ్ర ప్రదేశ్లో భారీ ఎత్తున దొంగతనాలు, దోపిడీలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే వాడు. ఇలాంటి గజదొంగ కథ బయోపిక్గా తెరకెక్కతుండటంతో ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ఫేం వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇక ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 20న దింపుతున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. దాంతో ఇప్పటి నుంచి ప్రమోషన్లు గట్రా చేసి సినిమాపై మంచి హైప్ తీసుకురావాలని మేకర్స్ పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్లుక్ పోస్టర్లో రవితేజ రగ్గుడ్ లుక్లో ఊరమాస్గా కనిపిస్తున్నాడు. ఫస్ట్లుక్తో పాటు మోషన్ పోస్టర్ను కూడా చిత్రబృందం రిలీజ్ చేసింది. మోషన్ పోస్టర్కు వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు.
అది 70వ దశకం. బంగాళఖాతం తీర ప్రాంతంలోని ఓ చిన్న గ్రామం. ప్రపంచాన్ని బయపెట్టే చీకటి కూడా అక్కడి జనాల్ని చూసి బయపడుతుంది. దడ దడ మంటూ వెళ్లే రైలు ఆ ప్రాంత పొలిమేర రాగానే గజ గజ వణుకుతుంది. ఆ ఊరి మైలు రాయి కనబడితే జనం అడుగులు తడబడుతాయి. దక్షిణ భారతదేశపు నేల రాజధాని ది క్రైమ్ కాపిటెల్ ఆఫ్ సౌత్ఇండియా స్టూవర్ట్పురం. ఆ ప్రాంతానికి ఇంకో పేరు కూడా ఉంది టైగర్ జోన్. ది జోన్ ఆఫ్ టైగర్ నాగేశ్వరరావు అంటూ వెంకటేష్ ఎలివేషన్ డైలాగ్ గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఇక చివర్లో జింకల్ని వెంటాడే పులిని చూసుంటావు. పులిని వేటాడే పులిని ఎప్పుడైనా చూశావా అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ మోషన్ పోస్టర్కే హైలేట్గా నిలిచింది.
లేటెస్ట్గా రిలీజైన మోషన్ పోస్టర్ మాస్రాజా అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. జీవి.ప్రకాష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవల్లో ఉంది. ఇక టాలీవుడ్ చరిత్రలోనే కనీవిని ఎరుగుని రీతిలో ఫస్ట్లుక్ పోస్టర్కు సంబంధించిన ఈవెంట్ను రాజమండ్రిలోని గోదావరి బ్రిడ్జిపై మేకర్స్ జరిపారు. ఒక ఫస్ట్లుక్ పోస్టర్కు ఈ రేంజ్లో హడావిడి మునుపెన్నడూ జరుగలేదు.
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకు ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ఫేం వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్పై అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. రేణుదేశాయ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.