మంగళవారం జరిగిన ఎపిసోడ్లో ప్రియాంక- మానస్ మధ్య వార్ ఎక్కువగా నడిచింది. మధ్యలో కాజల్ దూరినందుకు ఆమెపై కూడా మండిపడింది ప్రియాంక. అందరూ అంటుంటే తెలియలేదు కానీ.. ఇప్పుడు తెలిసింది.. కాజల్ హౌస్ నుంచి వెళ్తేనే గొడవలు తగ్గుతాయేమో అని నోటికొచ్చినట్టు అరిచింది ప్రియాంక. ఆ తరువాత మానస్ వెళ్లి భోజనంపై కోపగించకు వచ్చి తిను అంటే.. ప్రియాంక ఏడుస్తూ మానస్ని హగ్ చేసుకుంటుంది.
ఇక ప్రియాంక దగ్గర కూర్చుని షణ్ముఖ్కి కాస్త జ్ఞానోదయం చేస్తుంటాడు. నువ్ టాప్ 5లో ఉండాలంటే.. వేరే వాళ్లకి జై కొడితే కావు.. వాళ్లు నిన్ను సెపరేట్ చేస్తున్నారు.. మొన్న ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు కాజల్.. హమ్మయ్య మనోళ్లు అందరూ వచ్చేశారని అన్నది.. మన అంటే ఎవరు అని రవి అంటే.. మానస్, సన్నీ, నేను అని చెప్పింది. దీన్ని బట్టి తెలుసుకో వాళ్లు నీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో. సన్నీ నామినేషన్స్లో లేడు కాబట్టి.. కాజల్ అతనికి దగ్గరగా ఉంటుంది.. అతని ఫ్యాన్స్ ఓట్లు ఆమెకు పడతాయని.. అని పుల్ల వేశాడు
ఇక షణ్ను కెప్టెన్సీ పూర్తయినట్లు ప్రకటించాడు బిగ్బాస్. అనంతరం బిగ్బాస్ ప్రతిష్టాత్మకమైన “టికెట్ టు ఫినాలే” టాస్క్ ప్రవేశపెట్టాడు. ఇందులో మొదటి లెవల్ ‘ఎండ్యురెన్స్ టాస్క్’లో భాగంగా కంటెస్టెంట్లు వీలైనంత ఎక్కువ సేపు ఐస్ టబ్లో ఉండాలి. ఒక్క కాలు బయటపెట్టినా సరే ఆ సమయంలో ఇతరులు వారి టబ్లోని బాల్స్ తీసుకోవచ్చని తెలిపాడు. అయితే సన్నీకి అటు ఇటు మానస్ కాజల్ ఉండడంతో బాల్స్ దొంగిలించడానికి కుదరలేదు. దీంతో స్థానాలు మార్చుకోమని చెప్పాడు. ఇక అసలు ఆట నేడు మెదలు కానుంది.