‘నాయకుడు’ సినిమా వచ్చి 37ఏళ్లయింది. సుధీర్ఘ విరామం తర్వాత కమల్హాసన్తో చేయి కలిపారు మణిరత్నం. వారిద్దరి కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘థగ్లైఫ్’.ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో మణిరత్నం సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ హిస్టారికల్ డ్రామాలో త్రిషాకృష్ణన్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో కమల్హాసన్, మణిరత్నం, ఆర్.మహేంద్రన్, శివ అనంత్లు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
దుల్కర్సల్మాన్, జయం రవి, నాజర్, ఐశ్వర్య లక్ష్మీ, గౌతం కార్తీక్ ఇందులో ప్రధానపాత్రధారులు. తాజా సమాచారం ప్రకారం హీరో శింబు కూడా ఇందులో భాగమైనట్టు తెలుస్తున్నది. అలాగే, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మీర్జాపూర్’ వెబ్సిరీస్లో ప్రధాన పాత్రధారులైన పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ కూడా ఇందులో నటిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇంతమంది భారీ తారాగణం చేరడం ఈ సినిమా క్రేజ్ మరింత పెరగడానికి దోహదపడుతుందని చెప్పకతప్పదు.