టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చివరిగా సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకులని ఎంతగానో అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరశరురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వడివడిగా జరుగుతుంది. సర్కారు వారి పాట చిత్రం తర్వాత మహేష్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం, రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు.
రీసెంట్గా సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్ ఆగస్ట్ 9న మహేష్ బర్త్ డే సందర్భంగా మధ్యాహ్నాం 12 గంటలకు చిత్రం నుండి మరో పోస్టర్ను విడుదల చేయనున్నారు. ఉదయం 9 గంటలకు ‘సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్’పేరుతో మహేశ్ కొత్త సినిమా అప్డేట్ ఇవ్వబోతున్నారు. మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ ‘ఎస్ఎస్ఎంబి28’నుంచి కూడా ఒక అప్డేట్ రానుంది.
మహేష్ బర్త్ డే సందర్భంగా రానున్న ఈ మూడు అప్డేట్స్ ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేయడం ఖాయం అని అంటున్నారు. ఆగస్టు 9న మహేష్ బాబు తన 46 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. అయితే ఈ సారి తన పుట్టిన రోజును షూటింగ్ సభ్యులతో మాత్రమే కాకుండా తన కుటుంబంతో కూడా జరుపుకోవాలి అనుకుంటున్న మహేష్ బాబు తన కుటుంబంతో పాటు గోవాకి వెళ్ళనున్నారు. షూటింగ్ కోసం మహేష్ బాబు ముందు రోజే గోవాకి వెళ్ళనుండగా, ఆ తర్వాత నమ్రత, పిల్లలు వెళతారట.