Telugu movies |ఐపీఎల్ను మించిన క్రేజ్తో ‘ఆర్ఆర్ఆర్’ సందడి ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం టిక్కెట్ రేట్లు తగ్గడంతో ప్రేక్షకులు కూడా సినిమాను మరోసారి రిపీట్ చేస్తున్నారు. ఇప్పటికే నైజాంలో ఈ చిత్రం 100కోట్ల మార్కును సాధించి రికార్డు సాధించింది. గతవారం తాప్సీ నటించిన ‘మిషన్ ఇంపాజిబుల్’ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ చిత్రం మొదటి షో నుంచి పాజిటీవ్ రివ్యూలను తెచ్చుకున్న ఆర్ఆర్ఆర్ ముందు నిలబడలేకపోయింది. రూ.2.5కోట్లతో బ్రేక్ఈవెన్తో రంగంలోకి దిగిన ఈ చిత్రం ఇప్పటివరకు కేవలం 1.1 కోట్ల షేర్ మాత్రమే సాధించింది. ఇదిలా ఉంటే ఈ వారం థియేటర్లలో పాటు ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో ఓ లుక్కేద్ధాం
గని:
విభిన్న కథలను ఎంచుకునే నటుడిగా సినీరంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈయన సినిమాలలో ఏదో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు అభిప్రాయం. ప్రస్తుతం ఈయన నటించిన లేటెస్ట్ మూవీ ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమా పైన భారీ అంచానాలను నమోదు చేశాయి. ఈ చిత్రంలో వరుణ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. అల్లుఅరవింద్ సమర్పణలో అల్లుబాబీ, సిద్ధూముద్ధ నిర్మించారు.
మా ఇష్టం (డేంజరస్):
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మా ఇష్టం(డేంజరస్)’. నైనా గంగూలీ, అప్సరా రాణి ప్రాధాన పాత్రల్లో నటించారు. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం కేవలం పెద్ద వారికోసమే అని టీజర్ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. గతేడాది షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కథ కంచిక మనం ఇంటికి:
అదిత్ అరుణ్, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కథ కంచికి మనం ఇంటికి’. చాణక్య చిన్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎంపీ ఆర్ట్స్ బ్యానర్పై మోనిష్ పట్టిపటి నిర్మించాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. కామెడీ హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్8న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు రెడ్డిగారింట్లో రౌడియిజం విడుదల కానుంది.
ఓటీటీ:
ఈటీ:ఎవ్వడికి తలవంచడు:
తమిళ స్టార్ సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈటీ:ఎవ్వడికి తలవంచడు’. మార్చి 10న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది. రూ.4 కోట్ల బ్రేక్ఈవెన్తో బరిలోకి దిగిన ఈ చిత్రం 3.2కోట్ల కలెక్షన్లను సాధించి తెలుగులో ఎబోయావరేజ్గా నిలిచింది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని కళానిధి మారన్ నిర్మించాడు. ఏప్రిల్ 7నుంచి ఈ చిత్రం నెట్ఫ్లిక్స్, సన్ఎన్ఎక్స్టీలో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టాండప్ రాహుల్:
ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజ్ తరణ్. కెరీర్ ఆరంభంలోనే హ్యట్రిక్ బ్లాక్ బస్టర్లను సాధించి టైర్ 2 హీరోల జాబితాలో ప్లేస్ దక్కించుకున్నాడు. తర్వాత కథల ఎంపిక విషయంలో పొరపాట్లు జరగంతో క్రమంగా ఈయన క్రేజ్ తగ్గుతూ వచ్చింది. ఇటీవలే ఈయన ‘స్టాండప్ రాహుల్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సారి మంచి హిట్టుతో వస్తాడనుకున్న తరుణ్కు ఈ చిత్రం కూడా తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 8 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. వర్షబొల్లమ్మ హీరోయిన్గా నటించింది.