kalyanam Kamaneeyam Movie | టాలీవుడ్లోని అగ్ర నిర్మాణ సంస్థలలో యూవీ క్రియేషన్స్ ఒకటి. మొదట్లో వరుస హిట్లతో దూసుపోయిన ఈ సంస్థ గత రెండు, మూడేళ్ల నుండి సరైన హిట్టు అందుకోలేపోతుంది. ఇక గతేడాది ‘రాధేశ్యామ్’తో భారీ పరజయాన్ని మూట గట్టుకుంది. ఈ సినిమాతో యూవీ క్రియేషన్స్కు దాదాపు రూ.150 కోట్ల నష్టం వచ్చింది. అయితే ఇండస్ట్రీలో నష్టాలు సాధరణమే అని భావించి ఈ సంస్థ ముందుకు దూసుకెళ్తూ ఉంది. ప్రస్తుతం ఈ బ్యానర్లో మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో ‘కళ్యాణం కమనీయం’ ఒకటి. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిందో.. ఎప్పుడు పూర్తయిందో కూడా ఎవరికీ తెలియకుండా సైలెంట్గా కంప్లీట్ చేశారు.
యూవీ సంస్థ ప్రకటించే వరకు ఇలాంటి సినిమా ఒకటుందన్న విషయమే చాలా మందికి తెలియదు. ఇప్పటికే సంక్రాంతికి నువ్వా నేనా అనే రీతిలో వార్ జరగుతుంటే, యూవీ అనూహ్యంగా ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకైతే ఈ సినిమాపై ఎలాంటి అంచనాల్లేవు. కానీ పాజిటీవ్ టాక్ వస్తే గనుక హిట్టయ్యే అయ్యే చాన్స్ ఉంది. అయితే ఈ సినిమా హిట్టవ్వాలంటే ఏదో మేజిక్ జరగాలి. ఎందుకంటే ఈ సినిమా చుట్టూ పెద్ద వలయమే ఉంది. ఈ మూవీ రిలీజయ్యే నాటికే ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’, ‘వారసుడు’, ‘తెగింపు’ సినిమాలు విడుదవుతాయి. ఈ నాలుగింటిలో ఏ రెండు సినిమాలకు పాజిటీవ్ టాక్ వచ్చిన ‘కళ్యాణం కమనీయం’ సినిమాకు చిక్కు ఎదురవుతుంది. థియేటర్లు దాదాపు దొరకవు. ఒక వేళ దొరికిన పరిమిత సంఖ్యలోనే దొరుకుతాయి.
మరి ఇంత రిస్క్ చేసి యూవీ ఈ సంస్థను ఎందుకు రిలీజ్ చేస్తుందో వాళ్లకే తెలియాలి. అయితే గతంలో కూడా 2016 సంక్రాంతికి ‘నాన్నకు ప్రేమతో’, ‘డిక్టేటర్’, ‘సోగ్గాడే చిన్ని నాయన’ వంటి సినిమాలకు పోటీగా ‘ఎక్స్ప్రెస్ రాజా’ను దింపింది. అప్పటి వరకు పెద్ద ప్రమోషన్లు కూడా చేయలేదు. కానీ ఈ సినిమా అనూహ్యంగా విజయం సాధించి యూవీకి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత రెండేళ్లకు మళ్లీ సంక్రాంతికి ‘అజ్ఞాతవాసి’, ‘జై సింహా’ సినిమాలకు పోటీగా ఒక వారం తర్వాత ‘భాగమతి’ సినిమాను రిలీజ్ చేసింది. అయితే అప్పటికే ఆ రెండు సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో భాగమతి సినిమాకు కలిసి వచ్చింది.
కాగా ఇప్పుడు అదే ధైర్యంతో యూవీ ‘కళ్యాణ వైభోగమే’ సినిమాను రిలీజ్ చేస్తుందని టాలీవుడ్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే ఎక్స్ప్రెస్ రాజా, భాగమతి సినిమాలకు శర్వానంద్, అనుష్క ఇమేజ్ కాస్త కలిసి వచ్చింది. కానీ సంతోష్ శోభన్ ఇప్పుడిప్పుడు గుర్తింపు తెచ్చుకుంటున్న నటుడు. పైగా ఈయన నటించిన లాస్ట్ మూవీ డిజాస్టర్. ఇలాంటి సమయంలో కళ్యాణం కమనీయం రిలీజ్ చేయడం రిస్క్ అనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సినిమా ప్రమోషన్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు గానీ, టీజర్ గానీ ఎలాంటి బజ్ క్రియేట్ చేయలేదు. మరీ ఆ నాలుగు సినిమాల పోటీని తట్టుకుని ఈ సినిమా ఎంత వరకు నిలుస్తుందో చూడాలి.
రోమ్-కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు అనీల్ కుమార్ ఆళ్ల దర్శకత్వం వహించాడు. సంతోష్ శోభన్కు జోడీగా ప్రియా భవాని శంకర్ నటించింది. యూవీ కాన్సెప్ట్స్ రూపొందించిన ఈ సినిమాకు శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించాడు.