బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం రసవత్తరంగా సాగుతుంది. 19 మంది కంటెస్టెంట్లతో షో మొదలు కాగా, మూడు వారాలు ముగ్గురిని బయటకి పంపించాడు బిగ్ బాస్. నాలుగో వారం మరొక కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. అయితే మూడు వారాలలో సరయు, ఉమాదేవి,లహరి ఎలిమినేట్ కాగా ఈ ముగ్గురు మహిళలే.
నాలుగోవారం పురుషుడిని ఎలిమినేట్ చేయనున్నట్టు తెలుస్తుంది. సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఎక్కువ ఓట్స్ పొందిన నటరాజ్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి, సన్నీ, ఆనీ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ ఎనిమిది మందిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు.
నటరాజ్ మాస్టర్, అనీ మాస్టర్ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని ప్రచారం జరగగా,ఇప్పుడు నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ కావడం పక్కా అంటున్నారు.హౌజ్లోని కంటెస్టెంట్స్ని జంతువులతో పోలుస్తూ ఇరిటేట్ చేస్తున్నాడు. మొదట్లో హౌస్లో గుంటనక్క ఉందని ప్రచారం చేశాడు నటరాజ్. హౌస్లో ఊసరవెల్లి కూడా ఉందని, సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ రెండూ ఎవరో చెప్తానన్నాడు. అయితే రానురానూ ఆ రెండింటితో పాటు పిల్లి, నెమలి, ఎలుగుబంటి, నత్త అంటూ చెప్పుకొచ్చాడు. నటరాజ్ మాస్టర్ పద్ధతి ప్రేక్షకులకి పెద్దగా నచ్చకపోవడంతో ఈ వారం ఆయనని ఎలిమినేట్ చేస్తున్నట్టుగా సమాచారం.