‘మసూద’ చిత్రం ద్వారా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు హీరో తిరువీర్. ఆయన ప్రధాన పాత్రలో ఓ పీరియాడిక్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఏషియన్ ఫిల్మ్స్ నారాయణ దాస్ నారంగ్ సమర్పణలో రవికుమార్ పనస ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.జి.దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సందర్భంగా నిర్మాత రవి కుమార్ పనస మాట్లాడుతూ ‘వినూత్న కథాంశమిది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉన్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అన్నారు.