ట్రాన్స్జెండర్ హక్కుల కోసం పోరాటం చేసిన శ్రీగౌరి సావంత్ జీవిత కథ ఆధారంగా చేసుకుని ‘తాలి’ వెబ్సీరిస్ను తెరకెక్కించారు. రవిజాదవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ ఆగస్టు 15 నుంచి జియో సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమ్ కానుంది. అయితే ఇందులో ట్రాన్సెజెండర్ పాత్రలో సుస్మితా సేన్ నటించడంపై పలు విమర్శలు వస్తున్నాయి.
వీటిపై సీరిస్ నిర్మాతలు కార్తిక్, అర్జున్ మాట్లాడుతూ ‘సుస్మితాసేన్ లాంటి గొప్పస్టార్ని మెయిన్లీడ్గా తీసుకుంటే ఈ సిరీస్ కోట్లాది మంది ప్రేక్షకులకు రీచ్ అవుతుంది. అందుకే ఆమెను ఎంచుకున్నాం. ఒక ట్రాన్స్జెండర్ను ఇందులో నటిగా చూపిస్తే ఇది డాక్యుమెంటరీ అవుతుంది. కేవలం కొంతమందికే రీచ్ అవుతుంది. ఎక్కువ మంది ఈ కథను చెప్పాలన్న మా లక్ష్యం నెరవేరదు’ అని చెప్పారు. గత కొన్నేళ్లుగా కథల ఎంపికలో సెలెక్టివ్గా ఉంటున్నది సుస్మితా సేన్.