అక్షయ్ కుమార్ హీరోగా నటించిన కొత్త సినిమా టైటిల్ మారింది. ‘మిషన్ సిండ్రెల్లా’ పేరుతో ఉన్న ఈ చిత్రాన్ని ‘కట్పుట్లి’గా మార్చారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నాయికగా నటించింది. రంజిత్ తివారీ దర్శకత్వం వహించారు. తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘రాక్షసుడు’ చిత్రానికి రీమేక్గా ఈ సినిమా తెరకెక్కింది.
అమ్మాయిలను కిడ్నాప్ చేసే గ్యాంగ్ను ఓ పోలీస్ ఆఫీసర్ ఎలా పట్టుకున్నాడు అనేది చిత్ర కథాంశం. ఈ సినిమా ఓటీటీలో సెప్టెంబర్ 2న ప్రీమియర్కు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ స్పందిస్తూ…‘ఈ ఆట బలంతో కాదు బుద్ధితో..ఈ మైండ్ గేమ్లో మీరూ నేనూ ఉంటాం’..అంటూ ట్వీట్ చేశారు. అక్షయ్ కుమార్ తాజా చిత్రం ‘రక్షా బంధన్’ ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతున్నది.