Panchayat 4 | ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ పంచాయత్ ఇప్పటికే మూడు సీజన్లు రాగా సూపర్ హిట్ అందుకున్నాయి. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ నుంచి నాలుగో సీజన్ రాబోతుంది. ఈ టీజర్ చూస్తుంటే ఈసారి ఫులేరా గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది. ప్రధాన జీ (రఘుబీర్ యాదవ్), భూషణ్ (దుర్గేష్ కుమార్) మధ్య హోరాహోరీ పోరు జరగబోతున్నట్లు తెలుస్తుంది.
టీజర్లో ఎన్నికల ప్రచారం, రాజకీయ వ్యూహాలు, ఊహించని మలుపులు కనిపించాయి. ప్రధాన జీ, భూషణ్ తమ మద్దతుదారులతో ప్రచారం నిర్వహిస్తున్న దృశ్యాలు ఆసక్తిని పెంచాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. గత సీజన్లలోని ప్రధాన పాత్రలు పోషించిన జితేంద్ర కుమార్ (అభిషేక్), నీనా గుప్తా (మంజు దేవి), ఫైసల్ మాలిక్, చందన్ రాయ్ ఈ సీజన్లోనూ కొనసాగుతున్నారు. ఈ సీజన్ జూలై 2, 2025 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. టీజర్ విడుదల కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫులేరా రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడటానికి వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.