సినిమా విడుదలైన గంటల్లోనే వెబ్ సైట్లో అప్లోడ్ చేస్తూ దక్షిణాది చిత్రాలకు నష్టాన్ని కలుగజేస్తున్నది తమిళ్ రాకర్స్ వెబ్ సైట్. ఈ వెబ్ సైట్ నెట్ వర్ ఎలా పనిచేస్తున్నదనే నేపథ్యంతో ఏవీఎం సంస్థ నిర్మించిన వెబ్ సిరీస్ ‘తమిళ్ రాకర్స్’. దీంట్లో అరుణ్ విజయ్, వాణి బోజన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అరుణ నిర్మాణ సారథ్యంలో దర్శకుడు అరివఝగన్ రూపొందించారు.
సోని లివ్ ఓటీటీలో ఈనెల 19న ఈ సిరీస్ స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా దర్శకుడు అరివఝగన్ మాట్లాడుతూ…‘తమిళ్ రాకర్స్ దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్లో కూడా ప్రమాదకరంగా తయారయ్యారు. వీళ్లు ఎలా పనిచేస్తున్నారు అనే అంశాన్ని కథగా చేసుకుని ఈ వెబ్ సిరీస్ రూపొందించాం. వాళ్లు సినిమాలను ఎలా ఫిల్మింగ్ చేస్తున్నారు? ఎలా అప్ లోడ్ చేస్తున్నారు?
అని సాగే ఇన్వెస్టిగేషన్తో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది’ అన్నారు. హీరో అరుణ్ విజయ్ మాట్లాడుతూ…‘ఒక సినిమా రూపకల్పనలో ఎంత శ్రమ ఉంటుందో మీకు తెలుసు. ఆ కష్టం ఇలా పైరసీ వల్ల దోపిడీకి గురవుతున్నది. మనం వీళ్లను వెలుగులోకి తీసుకురావడం ఈ సమస్యకు ఒక పరిషారం అయితే రెండోది ప్రేక్షకులు ఎవరూ పైరసీ సినిమాలు చూడకుండా బహిషరించాలి. అప్పుడే తమిళ్ రాకర్స్ లాంటి వెబ్ సైట్స్ పతనం అవుతాయి’ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయిక వాణి భోజన్, నిర్మాత అరుణ గుహ పాల్గొన్నారు.