రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రియల్ దండుపాళ్యం’. రామ నాయక్ సమర్పణలో శ్రీ వైష్ణోదేవి పతాకంపై సి.పుట్టస్వామి తెలుగు, కన్నడ భాషల్లో నిర్మించారు. మహేష్ దర్శకుడు. ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా నిర్మాత సి పుట్టస్వామి మాట్లాడుతూ..మగాళ్ల్ల వంచనకు గురైన ఐదుగురు అమ్మాయిల కథ ఇది. వాస్తవ సంఘటనల ఆధారంగా నిర్మించాం. సహజత్వం ఉట్టిపడేలా సినిమాను రూపొందించారు దర్శకుడు’ అన్నారు. సినిమాను ఒక సవాలుగా తీసుకుని నటించానని, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయని హీరోయిన్ రాగిణి ద్వివేది చెప్పింది.