The Railway Men | ఇండియన్ మోస్ట్ ప్రెస్టీజియస్ బ్యానర్ యష్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films), ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న వెబ్ సిరీస్ ‘ది రైల్వే మెన్'(The Railway Men). కోలీవుడ్ స్టార్ హీరో ఆర్. మాధవన్, కే కే మీనన్, దివ్యేండు శర్మ, బాబిల్ ఖాన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ వెబ్ సిరీస్ను శివ్ రావైల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సిరీస్ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు.
టీజర్ గమనిస్తే.. ప్రపంచంలో అత్యంత ఘోరమైన పారిశ్రామిక విపత్తుగా పరిగణించబడే విషాదకరమైన 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కుతుంది. ఇక ఈ దుర్ఘటన సమయంలో ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడిన భారతీయ రైల్వే ఉద్యోగుల జీవిత కథ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రానుంది. మాధవన్ ఈ సిరీస్లో సెంట్రల్ రైల్వేస్ జనరల్ మేనేజర్ పాత్రను పోషిస్తుండగా.. స్టేషన్ మాస్టర్గా కే కే మీనన్, పోలీసు కానిస్టేబుల్గా దివ్యేండు, లోకో పైలట్గా బాబిల్ ఖాన్ నటిస్తున్నారు. ఇక ఈ సిరీస్ నవంబర్ 18 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది.
One tragic night that stirred the entire nation and four heroes who fought through it all.
Here’s the teaser for #TheRailwayMen – a four episode series inspired by true stories. Arrives November 18, only on Netflix! pic.twitter.com/jReeGfQIJE— Netflix India (@NetflixIndia) October 28, 2023
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో 1984 డిసెంబర్ 2-3 మధ్య రాత్రి వేళ యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ పురుగుమందుల ప్లాంట్ నుంచి మిథైల్ ఐసోసైనేట్ విష వాయువులు లీక్ అయ్యాయి. ఈ దుర్ఘటన వలన సుమారు మూడు వేల మంది వరకు మరణించగా ఐదు లక్షలకుపైగా గాయపడ్డారు. ఎన్నో కుటుంబాలు ఎన్నో ఏండ్లగా బాధితులుగా మిగిలాయి. ప్రపంచంలోని అతి దారుణమైన పారిశ్రామిక విపత్తులలో ఒకటిగా దీనిని పరిగణించారు.