Puri Sethupathi | అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా ప్రాజెక్ట్ ‘పూరి సేతుపతి’. విజయ్ సేతుపతి హీరోగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్లో టబు హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా.. తాజాగా ఈ చిత్రయూనిట్ మెగాస్టార్ చిరంజీవిని కలుసుకుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడితో కలిసి మన శంకరవరప్రసాద్ గారు అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతుండగా.. ఈ సినిమా పక్కనే షూటింగ్ జరుపుకుంటున్న ‘పూరి సేతుపతి’ టీమ్ చిరుని కలుసుకుని ఆశీస్సులు తీసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోను చిత్రబృందం ఎక్స్ వేదికగా పంచుకుంది. ఇందులో నటులు చిరంజీవితో పాటు విజయ్ సేతుపతి, టబు, నయనతార, ఛార్మీ తదితరులు ఉన్నారు.
What a ‘MEGA’ moment ❤️
Team #PuriSethupathi had the honour of meeting Megastar @Kchirutweets garu and the team of #ManaShankaraVaraPrasadGaru on the sets ❤️🔥
The Hyderabad schedule is racing ahead with the full cast in action💥
A #PuriJagannadh film 🎬#Charmmekaur Presents 🎥 pic.twitter.com/DR2HeklhfL
— Puri Connects (@PuriConnects) September 10, 2025