‘సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా కొత్త కథలకే నేను ప్రాధాన్యతనిస్తాను. సామాజిక సందేశం ఉన్న కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమాలో అంతర్లీనంగా చర్చించిన ఓ పాయింట్ బాగా నచ్చింది’ అన్నారు వరుణ్తేజ్. ఆయన కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున’ ప్రీరిలీజ్ వేడుక సోమవారం హైదరాబాద్లో జరిగింది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలకానుంది. ఈ సందర్భంగా వరుణ్తేజ్ మాట్లాడుతూ ‘కేవలం మన కుటుంబం గురించే కాకుండా సమాజం గురించి కూడా ఆలోచించాలని తెలియజెప్పే చిత్రమిది. ఇటీవలే ఈ సినిమా చూశాను.
మంచి సినిమా చూశాననే భావన కలిగింది’ అన్నారు. ‘గ్లోబల్ ఇష్యూ మీద ఈ సినిమా తీశాం. ఎన్ని జోనర్స్లో సినిమాలు చేసినా..యాక్షన్ మూవీస్ తీసినప్పుడు వచ్చే కిక్కే వేరు. కేవలం 54 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. వరుణ్తేజ్ ఈ సినిమా కోసం అంకితభావంతో శ్రమించాడు’ అని దర్శకుడు తెలిపారు. వరుణ్తేజ్తో తాము తీసిన ‘తొలిప్రేమ’ హిట్ అయ్యిందని, ఈ సినిమాకు కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దిల్రాజు, అనిల్ రావిపూడి, శ్రీకాంత్ అడ్డాల తదితరులు పాల్గొన్నారు.