వసుఖి, మయూఖి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మయూఖి’. ఈ చిత్రాన్ని టీఐఎం గ్లోబల్ ఫిల్మ్స్ సమర్పణలో నంద కిషోర్, డి. టెరెన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏఎల్ నితిన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు ఏఎల్ నితిన్ కుమార్ మాట్లాడుతూ…‘గతంలో నేను నిర్మించిన ‘లోటస్ పాండ్’ అనే బాలల చిత్రం అంతర్జాతీయ చిత్రోత్సవాలకు ఎంపికైంది.
ఈ సినిమాకొస్తే మేనకోడలి కోసం మేమమామ చేసే సాహసాలతో ఆద్యంతం థ్రిల్లింగ్గా సాగుతుంది. చిత్రీకరణ అంతా అమెరికాలో జరిపాం. యాక్షన్, అడ్వెంచర్ మూవీగా ఆకట్టుకుంటుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ, రచయిత డార్లింగ్ స్వామి పాల్గొన్నారు.