‘ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్లుంటాయి. నేను మూడు పాత్రల్లో కనిపిస్తా. కథలో కొత్తదనంతో పాటు వినోదం కూడా మరో స్థాయిలో ఉంటుంది. ఈ సినిమా చూస్తూ ప్రేక్షకులు టెన్షన్స్ అన్నింటిని మరచిపోతారు’ అన్నారు సుధీర్బాబు. ఆయన కథానాయకుడిగా హర్షవర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర. సునీల్ నారంగ్, పూస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలు.
ఈ నెల 6న విడుదలకానుంది. సోమవారం ప్రీరిలీజ్ వేడుకకు నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘అమ్మకు సంబంధించిన కథ ఇది. హృదయాన్ని కదిలించే ఎమోషన్స్ ఉంటాయి’ అన్నారు. మూడు గెటప్స్లో హీరో సుధీర్ నటన ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందని నిర్మాతలు తెలిపారు. హర్షవర్ధన్ కామెడీ టైమింగ్ బాగుంటుందని, ఈ సినిమా ద్వారా అతను దర్శకుడిగా పేరు తెచ్చుకుంటాడని ముఖ్య అతిథిగా విచ్చేసిన శేఖర్ కమ్ముల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోలు విశ్వక్సేన్, శ్రీవిష్ణు, శర్వానంద్ పాల్గొన్నారు.