“ది ఘోస్ట్’ సినిమాను కసితో తీశాం. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించాం. అద్భుతమైన కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు నాగార్జున. ఆయన కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందించిన ‘ది ఘోస్ట్’ చిత్రం దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 5న విడుదల కానుంది. శుక్రవారం ట్రైలర్ను విడుదల చేశారు. ఇంటెన్స్ యా క్షన్ ఎలిమెంట్స్తో ట్రైలర్ ఆకట్టుకుంది.
నాగార్జున మాట్లాడు తూ ‘నారాయణ్దాస్ నారంగ్గారికి ఎప్పటి నుంచో నాతో సినిమా చేయాలని కోరిక. అలా ఈ సినిమా మొదలైంది. దర్శకుడితో పా టు టెక్నీషియన్స్ అం దరూ ఎక్స్ట్రార్డినరీ వర్క్ చేశారు’ అని చె ప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను విజయవాడ ఎంపీగా పోటీ చేయబోతున్నాననే వార్తల్లో నిజంలేదని, ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని నాగార్జున స్పష్టం చేశారు. ‘ఈ సినిమా ద్వారా నాగార్జునగారు ఓ యాక్షన్ విజువల్ ఫీస్ట్ని అందించబోతున్నారు. ఫైనల్ కాపీ చూసి మేము చాలా ఎక్సైట్ అయ్యాం. థియేటర్లో ప్రేక్షకులు కూడా అదే అనుభూతికిలోనవుతారు’ అని దర్శకుడు తెలిపారు.