విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ జంటగా నటించిన చిత్రం ‘వాళ్ళిద్దరి మధ్య’. వీఎన్ ఆదిత్య దర్శకుడు. అర్జున్ దాస్యన్ నిర్మాత. కాంటెంపరరీ లవ్స్టోరీగా రూపొందిన ఈ సినిమా నేరుగా నేడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘సహజత్వానికి దగ్గరగా ఉండే ప్రేమకథా చిత్రమిది. రెండు షేడ్స్ ఉన్న హీరో పాత్రలో విరాజ్ చాలా బాగా నటించాడు. ఫన్ అండ్ రొమాంటిక్ కామెడీ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు. ఈ సమావేశంలో హీరో విరాజ్ అశ్విన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు