యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఇది సిద్ధు నటిస్తున్న 8వ సినిమా. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వైష్ణవి ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.
మంగళవారం సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటన వెలువడింది. ఈ చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం తెలిపారు. ప్రస్తుతం సిద్ధు ‘టిల్లు స్కేర్’ అనే చిత్రంలో నటిస్తున్నారు.