‘ఇవాళ సినిమా విజయం సాధించాలంటే యాక్షన్ ఒక్కటే సరిపోదు. డ్రామా కూడా ఉండాలి. అలాంటి యాక్షన్ డ్రామాతో ‘ది ఘోస్ట్’ సినిమాను తెరకెక్కించాం’ అన్నారు నాగార్జున. ఆయన హీరోగా నటించిన ఈ సినిమా దసరా పండుగ రోజు విడుదలైంది. ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రవీణ్ సత్తారు రూపొందించారు. సోనాల్ చౌహాన్ నాయికగా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నారాయణదాస్ కె నారంగ్, పూస్కుర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించారు. ఈ సందర్భంగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున చెప్పిన విశేషాలు ఇవీ..
యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ ఈ చిత్రంతో కనెక్ట్ అవుతారు. యాక్షన్ సీక్వెన్స్లు చాలా ైస్టెలిష్గా ఉంటాయి. నేను ఇలాంటి సినిమా చేసి చాలా రోజులవుతున్నది. టెక్నికల్గా మూవీ ఉన్నత ప్రమాణాలతో ఉంటు ంది. టీమ్ ఎఫర్ట్ వల్లే సినిమా బాగా వచ్చింది. సినిమా చూశాక నేను సంతోషంగా ఫీలయ్యాను. నా శివ సినిమాలోని ఫ్యామిలీ ఎమోషన్ ఇందులోనూ ఉంది. అందుకే ఈ చిత్రాన్ని శివతో పోల్చాను. మంచి సినిమా ప్రేక్షకులకు చేరాలని బాగా ప్రమోషన్ చేస్తున్నాం.
ఇందులో మంచి కుటుంబ కథ ఉంది. కుటుంబ అనుబంధాలు ఉన్నాయి. తన ఫ్యామిలీని కాపాడేందుకు హీరో ఎలాంటి పోరాటం చేశాడనేది హార్ట్టచింగ్గా ఉం టుంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ కథను కొత్తగా ప్రెజెంట్ చేశారు. ఇందుకోసం ఆయన చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకున్నారు. ఇంత టైమ్ షూటింగ్లోనూ తీసుకుంటారని భయపడ్డాను. కానీ రెండు నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశాడు.
మేము మంచి స్నేహితులం. మా రెండు సినిమాలు ఒకే సీజన్లో విడుదలై విజయం సాధించిన సందర్భాలెన్నో ఉన్నాయి. అయితే ఒకే రోజున విడుదలవడం ఇదే తొలిసారి. సినిమా బాగుందంటే తప్పకుండా అన్ని చిత్రాలను ఆదరిస్తారు.
మీరు హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ చేశారు. సల్మాన్ ఇక్కడ నటిస్తున్నారు. సినిమాకు హద్దులు చెరిగిపోయాయని అనుకోవచ్చా?
ఇప్పుడు సినిమాలకు హద్దులు లేవు. అమెరికాలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సినిమాలకు బౌండరీస్ లేవు అనిపిస్తున్నది. నేను బాలీవుడ్లో నటించిన ‘బ్రహ్మాస్త్ర’ మంచి విజయాన్ని సాధించడం చాలా ఆనందంగా ఉంది.
‘శివ’ సినిమాను 4కే డిజిటల్లోకి మారుస్తున్నాం. ఇవే కాదు నా అన్ని సినిమాలు డిజిటల్లోకి మార్చాలి. కొన్ని ఫిలిం నెగిటివ్లు పాడవుతున్నాయి. ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయి.
రెండు మూడు కథలు చర్చల దశలో ఉన్నాయి. అలాగే ఒక వెబ్ సిరీస్ కోసమూ సంప్రదింపులు జరుగుతున్నాయి. అయితే ఒక ఆర్నెళ్లు విరామం తర్వాతే కొత్త ప్రాజెక్ట్ ప్రకటిస్తాను.