కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన తాజా చిత్రం వారిసు. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వం వహించాడు. తెలుగులో వారసుడుగా వస్తోంది. కాగా తమిళ వెర్షన్ ఇవాళ తమిళనాడులో గ్రాండ్గా విడుదలైంది. సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న నేపథ్యంలో వారిసు టీం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ఒక చిన్న ఐడియాతో ఈ సినిమా మొదలైందన్నాడు. నాకు కుటుంబమే తొలి ప్రాధాన్యత. ఏ కుటుంబం పరిపూర్ణమైనది కాదు.. కానీ మాకు ఒకే కుటుంబం ఉంది. విజయ్కి కథ చెప్పాలని దిల్ రాజు నాకు సూచించారు. సింగిల్ సిట్టింగ్లోనే వారిసు ఓకే అయింది. అయితే పూర్తిస్థాయి స్క్రిప్ట్తో విజయ్ను ఒప్పించాలని, అప్పటి నుంచి నాపై ఒత్తిడి మొదలైంది. విజయ్ ఇండియాలో ఉన్న స్టార్ హీరోల్లో ఒకరు.థియేటర్లలో సినిమాకు వస్తున్న రెస్పాన్స్ అద్భుతమన్నాడు.
సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ జయసుధ, శరత్కుమార్ గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమా చూసిన తర్వాత ఎస్ థమన్, నేను కన్నీళ్లు పెట్టుకున్నాం. తెలుగు వెర్షన్కు ఇలాంటి స్పందనే వస్తుందని ఆశిస్తున్నా. నాపై నమ్మకం పెట్టుకున్న దిల్ రాజుకు ధన్యవాదాలు.
రష్మికను నేను మొదటిసారి కలిసినపుడు విజయ్కు తాను వీరాభిమానిని అని చెప్పింది. సినిమాలో రష్మిక చాలా అందంగా కనిపిస్తుంది. ఆమె తన ఫేవరేట్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎక్జయిటింగ్గా ఉందని చెప్పింది. ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో విడుదల కావడం నాకు కొత్త అనుభూతినిచ్చిందని చెప్పుకొచ్చాడు వంశీపైడిపల్లి.
Snaps 📸📸 From #Vaarasudu Grand Press Meet ✨ #VaarasuduFromJan14th #Thalapathy @actorvijay @MusicThaman @directorvamshi @iamrashmika @karthikpalanidp @Cinemainmygenes @PVPCinema @SVC_official @shreyasgroup #Varisu pic.twitter.com/mENCeRzySP
— BA Raju's Team (@baraju_SuperHit) January 12, 2023