తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మాఫియా కథాంశం నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘మాస్టర్’ తర్వాత విజయ్-లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు న్నాయి. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించింది.
దర్శకుడు లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీయబోతున్నారని తెలిసింది. బాహుబలి, కేజీఎఫ్ తరహాలో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఆయన గత చిత్రాల తరహాలోనే మాఫియా, డ్రగ్స్ చుట్టూ నడిచే కథాంశమిదని చెబుతున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకురానుంది.