నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రాఫిట్ షేరింగ్ విధానంలో పారితోషికాలను తీసుకోవాలని, ఒకేసారి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్స్ ఇవ్వడం వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని తమిళ సినీ నిర్మాతలు గత కొంతకాలంగా బలంగా తమ వాదన వినిపిస్తున్నారు. ఇదే డిమాండ్తో శనివారం తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ టోకెన్ సమ్మెకు పిలుపునిచ్చింది.
దీంతో శనివారం తమిళనాట షూటింగ్స్ బంద్ అయ్యాయి. పెరిగిన నిర్మాణ వ్యయం, తారల భారీ పారితోషికాల వల్ల తాము నష్టపోతున్నామని, నిర్మాతలు నష్టపోతే సహాయం చేసేందుకు ఎవరూ ముందుకురావడం లేదని తమిళ నిర్మాతలు వాపోయారు. రెవెన్యూ షేరింగ్ విధానంపై నడిగర్ సంఘం (తమిళ నటీనటుల అసోసియేషన్) నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిర్మాతలు టోకెన్ స్ట్రైక్కు సిద్ధమయ్యారు. శనివారం ఒక్కరోజు మాత్రమే తాము సమ్మె చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.