Geethanjali Malli Vachindi | తెలుగు హీరోయిన్ అంజలి టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi). 2014లో కామెడీ అండ్ హార్రర్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్గా రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి కథనాయకుడిగా నటిస్తుండగా.. సత్యం రాజేశ్, షకలక శంకర్, అలీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కోన వెంకట్ కథ, స్రీన్ ప్లేను అందిస్తుండగా.. శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఇక ఈ వేడుకలో మీడియాతో ముచ్చటించిన కోన వెంకట్ ఎన్టీఆర్ అదుర్స్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ సినిమా అనంతరం ఏ సినిమాను సీక్వెల్ తీయాలి అనుకుంటున్నారు అని కోన వెంకట్ను ఒక రిపోర్టర్ అడుగగా.. తనకు ఎన్టీఆర్తో ‘అదుర్స్ 2’ తీయాలని ఉందని తన మనసులో మాటను వెల్లడించాడు. ఈ సినిమాలో చారిగా ఎన్టీఆర్ చేసిన నటన ఇంకెవరు చేయలేరు. ఆ సినిమాకి సీక్వెల్ తీసుకు రావాలని నాకు ఎప్పటినుంచో ఉంది. ఆ సీక్వెల్ కథ రాసుకున్న తరువాత.. ఎన్టీఆర్ ఇంటిముందు నిరాహార దీక్ష చేసి అయినా ఎన్టీఆర్ ని ఆ సీక్వెల్ కి ఒప్పిస్తాను అంటూ కోన వెంకట్ చెప్పుకొచ్చారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
#KonaVenkat about #NTR’s #Adhurs Sequel
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) April 3, 2024