ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు బి.గోపాల్కు సత్యజిత్ రే పురస్కారం వరించింది. భారతీయ సినీ పరిశ్రమకు చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డును అందజేయనున్నట్లు కేరళకు చెందిన సత్యజిత్ రే ఫిల్మ్ సొసైటీ ప్రకటించింది. ప్రముఖ మలయాళ దర్శకుడు బాలు కిరియత్, సంగీత దర్శకుడు పెరుంబవూర్ జీ రవీంద్రనాథ్తో పాటు పలువురు సినీ ప్రముఖులతో కూడిన ప్యానల్ పురస్కార విజేతగా బి.గోపాల్ను ఎన్నుకున్నారు. ఆదూర్ గోపాలకృష్ణన్, మదాబి ముఖర్జీ, జి.మోహన్ తర్వాత ఈ పురస్కారాన్ని అందుకున్న నాలుగో సినీ ప్రముఖుడు బి.గోపాల్ కావడం విశేషం. ఈ నెల 13న హైదరాబాద్లో జరిగే వేడుకలో ఆయనకు ఈ అవార్డును అందజేయనున్నారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగు, హిందీ భాషల్లో 35 సినిమాలకు బి.గోపాల్ దర్శకత్వం వహించారు.