హైదరాబాద్ : నగరంలోని ప్రముఖ ఫ్లైఓవర్ అయిన ‘తెలుగుతల్లి ఫ్లైఓవర్’ పేరును ‘తెలంగాణ తల్లి ఫ్లైఓవర్’గా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఫ్లైఓవర్పై తెలంగాణ తల్లి అని వచ్చేలా నూతన సుచిక బోర్డులను పెట్టారు. లోయర్ ట్యాంక్ బండ్ నుంచి సచివాలయం వరకు విస్తరించి ఉన్న ఈ ఫ్లైఓవర్కు ఇకపై ‘తెలంగాణ తల్లి ఫ్లైఓవర్’ అని పేరు మార్చగా.. తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని గుర్తింపును ప్రతిబింబించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2005లో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించి ‘తెలుగుతల్లి ఫ్లైఓవర్’గా నామకరణం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ పేరు మార్చాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది.