Phir Aayi Hasseen Dillruba | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను (Taapsee Pannu), 12 ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాస్సే (Vikrant Massey) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హసీన్ దిల్రుబా’. 2021లో థ్రిల్లింగ్ మర్డర్ మిస్టరీ కథాంశంతో వచ్చి ఓటీటీలో బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ చిత్రం. నేరుగా నెట్ఫ్లిక్స్లో విడుదలై మంచి రికార్డు వ్యూస్ సాధించింది. అయితే ఈ సూపర్ హిట్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’(Phir Aayi Hasseen Dillruba) అంటూ ఈ సినిమా రానుండగా ఫస్ట్ పార్ట్లో నటించిన విక్రాంత్ మాస్సే (Vikrant Massey), తాప్సీ (Taapsee), ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జయ్ప్రద్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
ఇక ఈ టీజర్ గమనిస్తే.. ఫస్ట్ పార్ట్లో భర్త (విక్రాంత్ మాస్సే)తో కలిసి పన్నాగం పన్ని ప్రియుడిని చంపిన రాణి కశ్యప్(తాప్సీ) అక్కడనుంచి పారిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తుంది. ఈ నేపథ్యంలో రాణికి ఎదురైన సంఘటనలు ఏంటి?, రాణి లైఫ్ లోకి పోలీసులు ఎందుకు వస్తారు?. రాణిని కాపాడటానికి విక్రాంత్ మాస్సే ఏం చేస్తాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను కనికా థిల్లాన్ నిర్మిస్తుంది. బాలీవుడ్ నటుడు సన్నీ కౌశల్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Rishu aur Rani ki kahaani mein pyaar aur pagalpan, dono abhi baaki hain.
Phir Aayi Hasseen Dillruba is coming soon, only on Netflix! 🔍#PhirAayiHasseenDillruba #PhirAayiHasseenDillrubaOnNetflix #NextOnNetflixIndia pic.twitter.com/3Y9YUy2qYY— Netflix India (@NetflixIndia) February 29, 2024