తనీష్, వికాస్ వశిష్ట, సహర్ కృష్ణన్, శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘అంతేలే కథ అంతేలే’. ఈ చిత్రాన్ని రిధిమా క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు శ్రీ ఎం నివాస్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
తాజాగా చిత్ర వివరాలను వెల్లడించారు. హీరో తనీష్ మాట్లాడుతూ..‘మానవ సంబంధాల నేపథ్యంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులోని భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. అరుదుగా వచ్చే చిత్రమిది’ అన్నారు. ‘రాయలసీమ ప్రాంతంలోని ఓ మారుమూల గ్రామం నేపథ్యంగా సినిమా సాగుతుంది. అనంతపురం, నల్గొండ, హైదరాబాద్లో మూడు షెడ్యూల్స్లో చిత్రీకరణ జరుపుతాం’ అని దర్శకుడు చెప్పారు.