శింబు కథానాయకుడిగా గౌతమ్మీనన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘వెందు తనిందదు కాడు’ తెలుగులో ‘లైఫ్ ఆఫ్ ముత్తు’ పేరుతో అనువాదమవుతున్నది. ఈ చిత్రాన్ని శ్రీస్రవంతి మూవీస్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నది. ఈ నెల 15న విడుదలకానుంది. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ సందర్భంగా నిర్మాత స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ ‘ట్రైలర్ చూసి బాగా ఇంప్రెస్ అయ్యాను. శింబు, గౌతమ్మీనన్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకుల తప్పకుండా నచ్చే కాన్సెప్ట్ ఇది. తెలుగులో భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. సిద్ధీ ఇద్నానీ, రాధికా శరత్కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నూని, పాటలు: అనంత్శ్రీరాం, కృష్ణకాంత్, సంగీతం: ఏ.ఆర్.రెహమాన్.