ప్రముఖ తమిళ హాస్యనటుడు ఆర్.ఎస్.శివాజీ(66) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శివాజీ శనివారం ఉదయం చెన్నయ్లో తుదిశ్వాస విడిచారు. కమల్హాసన్ సినిమాల్లో ఆయన ఎక్కువగా నటించారు. విచిత్రసోదరులు, జగదేకవీరుడు-అతిలోక సుందరి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా శివాజీ చేరువయ్యారు. ఆ సినిమాల్లో జనకరాజ్ కాంబినేషన్లో ఆయన చేసిన కానిస్టేబుల్ పాత్రలు దక్షిణాదిన ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. శివాజీ మరణం పట్ల తెలుగు, తమిళ చిత్రసీమలోని పలువురు సంతాపం వ్యక్తం చేశారు.