Ajith Kumar Won Medals | తమిళ స్టార్ అజిత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘వాలి’, ‘ప్రియురాలు పిలిచింది’, ‘గ్యాంబ్లర్’ వంటి సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నాడు. ఈయన నటించిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతుంటాయి. అజిత్ ఇటీవలే ‘వలిమై’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పోటీగా ‘భీమ్లానాయక్’ వంటి పెద్ద సినిమా ఉన్న మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ఈవెన్కు కాస్త దూరంలో ఆగిపోయి తెలుగులో ఎబో యావరేజ్గా నిలిచింది. ఇదిలా ఉంటే అజిత్ రీల్లోనే కాదు రియల్ లైఫ్లోనూ హీరోగా నిలిచాడు.
ప్రస్తుతం తిరుచ్చిలో 47 తమిళనాడు రాష్ట్ర షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలకు హీరో అజిత్, అతడి టీం కూడా పాల్గోంది. కాగా ఈ పోటీల్లో అజిత్ టీం నాలుగు బంగారు, రెండు కాంస్య పతకాలను గెలుచుకుంది. గతేడాది కూడా అజిత్ చెన్నైలో జరిగిన షూటింగ్ ఛాంపియన్ షిప్లో 6 బంగారు పతకాలను గెలుచుకున్నాడు. ఇలా 50 ఏళ్ళ వయసులోనూ అజిత్ క్రీడల్లో పతకాలు సాధించడంతో తమ హీరోను ప్రశంసిస్తూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇక పలువురు సినీ ప్రముఖులు అజిత్ను పొగడ్తలతో ముంచెస్తున్నారు.
సినిమాల విషయానికొస్తే అజిత్ ప్రస్తుతం ఎచ్.వినోద్ దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్నాడు. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన నీర్కొండ పార్వై, వలీమై సూపర్ హిట్ విజయాలుగా నిలిచాయి. ఈ క్రమంలో వీళ్ళ కాంబలో హ్యట్రిక్ తెరకెక్కనుందడటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. దీని తర్వాత అజిత్, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభించనుంది.