బిగ్ బాస్ సీజన్ 5 మరో రెండు రోజులలో ఆరోవారం కూడా పూర్తి చేసుకోనుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్తో ప్రారంభమైన ఈ ఆటలో తొలివారంలో సరయు, రెండోవారంలో ఉమాదేవి, మూడోవారంలో లహరి, నాలుగో వారంలో నటరాజ్ మాస్టర్, ఐదో వారంలో హమీదా ఎలిమినేట్ అయ్యారు. ఆరో వారంలో ఏకంగా పది మంది నామినేట్ అయ్యారు. నామినేషన్లో శ్రీరామ్ చంద్ర, సిరి, లోబో, విశ్వ, షణ్ముఖ్ జస్వంత్, ప్రియాంక, యాంకర్ రవి, జెస్సీ, శ్వేతా, సన్నీ ఉన్నారు.
నామినేషన్లో ఉన్న వారిలో శ్రీరామ్ చంద్ర, షణ్ముఖ్, యాంకర్ రవికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందరికంటే ఎక్కువగా షణ్ముఖ్కే ఓట్లు పడుతున్నాయి. సిరిపై పాజిటివ్ అభిప్రాయాలు లేనప్పటికీ.. షణ్ముఖ్తో దోస్తీ ఈమెకు బాగా కలిసివస్తుంది. ఇక జెస్సీ మెల్ల మెల్లగా చాపకింద నీరులా స్ట్రాంగ్ అవుతున్నాడు . ఇక ప్రియాంక విషయానికి వస్తే సింపథీతో చాలానే ఓట్లు పడుతున్నాయి.
ఇక శ్వేతా, లోబో, విశ్వ ఈ ముగ్గురిలో ఒకరికి ఈవారం మూడినట్టే అని అంటున్నారు. లోబో, విశ్వకి ఎంతో కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. శ్వేత పరిస్థితే మరింత దారుణంగా ఉంది. ఈ వారం ఆమె ఎలిమినేట్ కావడం పక్కా అంటున్నారు. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వారిలో నటరాజ్ మాస్టర్ తప్ప మిగతా వారందరు మహిళలు కావడం గమనర్హం.