SV Krishna Reddy | టాలీవుడ్లో ఎన్న సూపర్హిట్ సినిమాలను అందించిన ఎస్వీ కృష్ణారెడ్డి మరో సినిమాతో ముందుకు రాబోతున్నాడు. తన 43వ సినిమా వేదవ్యాస్ సినిమా ఇవాళ ప్రారంభమైంది. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్లు వీవీ వినాయక్, అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభమైంది. కె.అచ్చిరెడ్డి సమర్పణలో సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్పై పై ప్రముఖ వ్యాపారవేత్త కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ వేదవ్యాస్ సినిమాతో సౌత్ కొరియన్ నటి జున్ హ్యున్ జీ టాలీవుడ్కు పరిచయమవుతోంది. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరోయిన్ జున్ హ్యున్ జీని ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు” హలో … కంగ్రాట్యులేషన్స్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్” అంటూ బొకే అందించగా ఆమె “థాంక్యూ సర్ ” అనటాన్ని ముహూర్తపు షాటుగా చిత్రీకరించారు. కాగా ఈ ముహూర్తపు షాట్ కు దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇవ్వగా మరో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.. ఆద్యంతం వినూత్నంగా జరిగిన ఈ ప్రారంభోత్సవంలో ప్రముఖ నటులు మురళీ మోహన్, అలీ, జుబేదా అలీ, సాయికుమార్, కెమెరామెన్ శరత్ ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి తదితరులు పాల్గొన్నారు.