ఇటీవల మాసివ్ హార్ట్ ఎటాక్కు గురైంది బాలీవుడ్ తార సుస్మితా సేన్. ముంబై నానావతి ఆస్పత్రిలో యాంజియోప్లాస్టీ చికిత్స అనంతరం కోలుకున్న ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా వైద్యులకు, మిత్రులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. సుస్మితా సేన్ స్పందిస్తూ…‘తీవ్రమైన గుండెపోటు నుంచి కోలుకుంటున్నా. మీ ప్రేమే నన్ను బతికించిందని భావిస్తున్నా. నాకు అనారోగ్యం అని తెలిసినప్పటి నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా మీరు పంపిన శుభాకాంక్షలు చూసి ఉద్వేగానికి గురయ్యాను. సకాలంలో వైద్యులు చేసిన చికిత్సతో పునర్జన్మ పొందాను.
నన్ను కాపాడిన వైద్యులందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది. మీతో మాట్లాడేవరకు ఉండలేకపోయాను. త్వరలో ఎప్పటిలాగే నా షూటింగ్స్కు హాజరవ్వాలని అనుకుంటున్నా’ అని చెప్పింది. 1994లో మిస్ ఇండియాతో పాటు విశ్వసుందరి కిరీటం గెల్చుకుంది సుస్మితా. రెండేండ్ల తర్వాత మహేష్ భట్ థ్రిల్లర్ మూవీ ‘దస్తక్’తో బాలీవుడ్లో తెరంగేట్రం చేసింది. హిందీతో పాటు అనువాద చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులకూ సుస్మితాసేన్ పరిచయమైంది.