ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన అఖిల్ ఏజెంట్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. బుడాపెస్ట్లో అఖిల్ ఏజెంట్ షూటింగ్ జరుగుతుండగా, సురేందర్ రెడ్డితో పాటు అతని కుటుంబానికి కరోనా పాజిటివ్ అని తేలడంతో తాజా షెడ్యూల్ షూట్ కు అంతరాయం ఏర్పడింది. సురేందర్ రెడ్డి, అతని కుటుంబం ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు.
మిగిలిన చిత్ర యూనిట్ హైదరాబాద్కు తిరిగి వచ్చారు. రెండు వారాల పాటు అఖిల్, మమ్ముట్టిలపై కొన్ని కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు. సురేందర్ రెడ్డి పూర్తిగా కోలుకున్నాక పెండింగ్లో ఉన్న పార్ట్లను మళ్లీ చిత్రీకరించనున్నారు.ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, సురేందర్ సినిమా సంయుక్త సమర్పణలో ఈ ‘ఏజెంట్’ మూవీ రూపొందనుంది. మునుపెన్నడూ చూడని విభిన్నమైన కథ, యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారట.
ఈ సినిమాలో అఖిల్ని ఓ సీక్రెట్ ఏజెంట్గా సరికొత్త పాత్రలో చూపించబోతున్నారని తెలుస్తోంది. సాక్షి వైద్య ఈ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయం కానుంది. ఇక ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి పవర్స్టార్ పవన్కళ్యాణ్తో ఓ సినిమా చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చింది.