క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు సినిమాలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన నటి సురేఖా వాణి. చక్కటి అందంతో పాటు ఆకట్టుకునే నటన ఈమె సొంతం. సినిమాల్లో అడపదడపా కేరక్టర్ ఆర్టిస్టుగా రాణించే సురేఖా వాణి, ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో సైతం నిత్యం యాక్టివ్ గా ఉంటూ అక్కడ కూడా అదరగొడుతోంది. ముఖ్యంగా తన కూతురితో తెగ సందడి చేస్తూ అందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ వస్తుంది.
తాజాగా సురేఖా వాణి చీరకట్టు,మెడలో మంగళసూత్రంతో ఉన్న ఓ ఫొటోను షేర్ చేయడంతో నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా భర్త చనిపోయాక తాళి బొట్టు తీసేస్తారు. కాని రీసెంట్గా సురేఖా వాణి మెడలో మంగళసూత్రం కనిపించే సరికి అనుమానలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు షూటింగ్లో భాగంగా వేసుకొని ఉంటుందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గతంలోనూ ఆమె సెకండ్ మ్యారెజ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీయడంతో ఆ వార్తల్లో నిజం లేదని ఆమె స్ఫష్టం చేసిన సంగతి తెలిసిందే. జనానికి ఎంత హుషారుగా కనిపించినా సురేఖావాణి జీవితంలో కూడా ఎన్నో కష్టనష్టాలున్న సంగతి మనందరికీ తెలుసు. గత రెండేళ్ల క్రిందట భర్త సురేష్ తేజ మరణంతో ఆమె కృంగిపోయింది సురేఖ. ప్రస్తుతం తన కూతురు సుప్రితతో కలిసి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నానని సురేఖావాణి తెలిపింది.